
అవినీతి..అక్రమాలే ప్రాధాన్యం
● కూటమి పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మేలు చేయాల్సింది పోయి అధికారంలోకి రాగానే రాజకీయ కక్షకు తెరలేపారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉద్యోగాల నుంచి తొలగించారు.
● సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఈ కూటమి పాలనలో టీడీపీ నేతల స్మగ్లింగ్కు అడ్డాగా మారింది. అక్కడ టీడీపీ శ్రేణులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపే లేకుండా పోతోంది. గ్రానైట్, కృత్రిమ ఇసుక, తమిళ బియ్యం, జల్లికట్టు పందేలు, పలు అక్రమ వ్యాపారాలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.
● గత ప్రభుత్వంలో పలమనేరు వద్ద మొత్తం 2,088 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కారిడార్ను నిలిపేశారు.
● ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ఏర్పాటు చేసి జిల్లాలో దాదాపు 500 మంది చిరుద్యోగులు పొట్టకొట్టింది.
● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ వద్ద రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసేందుకు కూటమి నేతలు కన్ను వేసి కబ్జాకు యత్నించారు. అదే విధంగా కొత్తబస్టాండ్ వద్ద ఉన్న రూ.40 కోట్ల విలువ చేసే మత్స్యకార ప్రభుత్వ భవనానికి చెందిన స్థలాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.
● అన్న క్యాంటీన్ భవనాల రిపేర్ల పేరుతో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి ప్రభుత్వ నిధులను వేసుకున్నారు. రూ.3 లక్షలయ్యే రిపేర్లకు రూ.13 లక్షలు నుంచి రూ.20 లక్షలు చూపించి అక్రమంగా ప్రభుత్వ నిధులు కొట్టేశారు. ఈ అన్నా క్యాంటిన్ల అక్రమ తంతు జిల్లాలోని 16 క్యాంటిన్లలో సాగించారు.