
శ్రీనిఫుడ్ ఫ్యాక్టరీలో ఏనుగుల హల్చల్
బంగారుపాళెం: మండలంలోని మొగిలి శ్రీనిపుడ్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఏనుగులు ప్రవేశించి హల్చల్ చేశాయి. ఫ్యాక్టరీ సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి గౌనిచెరువు మీదుగా రెండు ఏనుగులు ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. సెక్యూరిటీ, ఫ్యాక్టరీ సిబ్బంది ఏనుగుల రాకను గురించి అరుపులు, కేకలు వేయడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. బుధవారం సాయంత్రం రెండు ఏనుగులు గౌనిచెరువులో దిగి సేద తీరాయని, అటు తరువాత అడవిలోకి వెళ్లి తిరిగి సమీపంలోని ఫ్యాక్టరీలోకి వచ్చాయన్నారు. మూడు, నాలుగు సార్లు ఏనుగులు ఫ్యాక్టరీలోకి వచ్చాయని సిబ్బంది తెలిపారు.