యువ నిరసనకారుడి వీడియో నెట్టింట్లో వైరల్

Young Protestor video Virul In Social Media - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు రెండోరోజు కొనసాగుతున్నాయి. నిరసనల్లో భాగంగా ఓ యువ నిరసనకారుడు పోలీసులను అడ్డుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆ నిరసనకారుడు పోలీసుల వాహనంపైకి దూకి, రైతులను చెదరగొట్టడానికి పోలీసులు ఉపయోగిస్తున్న వాటర్‌ కేనన్లను అడ్డుకున్నాడు. ​కాగా పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ మార్కెటింగ్ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు, రాజకీయ పార్టీలు వీధుల్లోకి రావడంతో శుక్రవారం పలు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. "రైతు వ్యతిరేకత" అని భావించిన బిల్లులకు వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తం చేయడానికి అనేక యూనియన్లు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని రైతులు నినాదాలు చేశారు, ఊరేగింపులు చేపట్టారు. పంజాబ్‌లో బంద్ విజయవంతంగా కొనసాగింది. 

మూడు బిల్లుల ఆధారంగా చట్టాలు వర్తించవని నిర్ధారించడానికి పంజాబ్ మొత్తాన్ని వ్యవసాయ ఉత్పత్తుల కోసం 'ప్రధాన మార్కెట్ యార్డ్'గా ప్రకటించాలని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న హర్యాణాలో, రైతులు కర్నాల్-మీరట్, రోహ్తక్-జాజ్జర్, ఢిల్లీ-హిసార్, ఇతర రహదారులను అడ్డుకున్నారు. దేశ రాజధానిలోనికి వెళ్లడానికి ప్రయత్నించగా ఢిల్లీ ఉత్తరప్రదేశ సరిహద్దు దగ్గర వందల మంది రైతులను ఆపేశారు. దీంతో నోయిడా ఘజియాబాద్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అయోధ్య-లక్నో హైవే, ఢిల్లీ-మీరట్ రహదారిని కూడా రైతులు కొన్ని గంటలు పాటుగా అడ్డుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌ జిల్లాలైన లఖింపూర్ ఖేరి, పిలిభిత్, సంబల్, సీతాపూర్, బాగ్‌పట్, బారాబంకి నుంచి నిరసనలు చెలరేగాయి.ఇక బీజేపీ పాలిత హరియాణా, కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌ సరిహద్దులో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. రైతులపై పోలీసులు బాష్ఫవాయువు, వాటర్‌కెనన్లు ప్రయోగించారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పంజాబ్‌ రైతులు ఢిల్లీ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేవరకూ తమ నిరసన కొనసాగుతుందని తెగేసి చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top