రూ. 14 వేల కోట్ల సమీకరణలో ఎస్‌బీఐ | SBI gets raise up to Rs 14,000 crore | Sakshi
Sakshi News home page

రూ. 14 వేల కోట్ల సమీకరణలో ఎస్‌బీఐ

Jun 22 2021 9:03 AM | Updated on Jun 22 2021 9:20 AM

SBI gets raise up to Rs 14,000 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా బాసెల్‌ త్రీ ప్రమాణాలకు అనుగుణమైన బాండ్ల జారీ ద్వారా రూ. 14,000 కోట్ల దాకా నిధులను సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెంట్రల్‌ బోర్డు ఆమోదముద్ర వేసిందని బ్యాంకు తెలిపింది. రూపాయి మారకం లేదా అమెరికన్‌ డాలరు మారకంలో బాండ్ల జారీ ఉండవచ్చని పేర్కొంది. సోమవారం బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 1.64 శాతం పెరిగి రూ. 419.55 వద్ద క్లోజయ్యింది. 

చదవండి: ఈ-కామర్స్‌కు కఠిన నిబంధనలు.. ఫ్లాష్‌ సేల్స్‌ నిషేధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement