
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో న్యూఢిల్లీలో జరిగిన 'సెమికాన్ ఇండియా 2025' శిఖరాగ్ర సమావేశంలో.. సెమీకండక్టర్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులందరినీ స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు.. భారతదేశంలో తయారైన వాటిని విశ్వసిస్తున్నాయి అని చెప్పే రోజు ఎంతో.. దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలో.. చమురును నల్ల బంగారం అని, చిప్స్ను డిజిటల్ డైమండ్స్ అంటారని అన్నారు. గత శతాబ్దం మొత్తం చమురుకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 21వ శతాబ్దం మాత్రం చిప్కే పరిమితం అని అన్నారు. ఈ చిప్ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు.
#WATCH | At Semicon India 2025, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw presents Vikram 32-bit processor and test chips of the 4 approved projects to PM Narendra Modi.
Vikram 32-bit processor is the first fully “Make-in-India” 32-bit… pic.twitter.com/8FCkbe0sve— ANI (@ANI) September 2, 2025
కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెమికాన్ ఇండియాలో.. ప్రధాని మోదీకి విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్లను అందజేశారు. మన ప్రధానమంత్రిని దూరదృష్టితో కొత్త ఆరంభం కోసం మొదటిసారి కలిశాము. అప్పుడే మేము ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించాము. ఇది 3.5 సంవత్సరాల వ్యవధిలోనే.. ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూసేలా చేసింది. నేడు, ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మేము ఇప్పుడు మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్ను ప్రధాని మోదీకి అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
గత కొన్ని సంవత్సరాలుగా సెమికాన్ ఇండియా ప్రణాళిక కింద జరుగుతున్న పురోగతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. 2023 నాటికి, భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధమైంది. 2024లో మేము అదనపు ప్లాంట్లను ఆమోదించాము. 2025లో మరో ఐదు అదనపు ప్రాజెక్టులను క్లియర్ చేసాము. మొత్తం మీద ప్రభుత్వం పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలు పెంచుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
First ‘Made in India’ Chips!
A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳
This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025