Telangana Government Going To Start a Y-hub For School Children - Sakshi
Sakshi News home page

Y-Hub: యూనెస్కోతో జట్టు కట్టిన తెలంగాణ.. కొత్తగా వై హబ్‌లు ?

Apr 5 2022 10:14 AM | Updated on Apr 5 2022 12:47 PM

KTR told That Telangana Govt Going To Start Y Hub for School Children to Encourage innovation - Sakshi

ఇన్నోవేషన్‌, టెక్నాలజీ రంగాలపై దృష్టి సారించింది తెలంగాణ సర్కారు. అందులో భాగంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇప్పటికే టీ హబ్‌ను ఏ‍ర్పాటు చేసింది. అక్కడ వచ్చిన స్పందన బాగుండటంతో వీహబ్‌, టీవర్క్స్‌ ఇలా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తోంది. తాజాగా యంగ్‌ టాలెంట్‌ కోసం వై హబ్‌ను ప్రారంభించబోతున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

వరల్డ్‌ క్లాస్‌ కంపెనీలకు విద్యార్థి దశలో ఉన్న ఎంట్రప్యూనర్లకు సంధానకర్తగా ఈ వై హబ్‌ పని చేయనుంది. ఇప్పటికే ఉన్న టీ హబ్‌, టీ వర్క్స్‌ వంటివి కాలేజీ లెవల్‌, కాలేజీ చదువు పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ స్టార్టప్‌ల నిర్మాణం జోరందుకుంది. దీంతో కొత్త ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు కింది స్థాయి నుంచే గట్టి పునాది వేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది.

కొత్త రకం ఆవిష్కరణలను స్కూల్‌ స్థాయి నుంచే ప్రోత​‍్సమించేందుకు వై హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర​​‍్ణయించారు. యూత్‌తో పాటు స్కూల్‌ చిల్డ్రెన్స్‌లో ఇన్నోవేషన్‌, టెక్నాలజీపై ఆసక్తి కలిగేలా చేయడంతో పాటు వారిలో ఉన్న కొత్త రకం ఆలోచనలను ప్రోత్సహించడం వై హబ్‌ ప్రధాన లక్ష్యం. ఈ వై హబ్‌కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు యూనిసెఫ్‌ సైతం తన వంతు సహకారం అందివ్వనుంది. ​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement