
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే. మురళీధర్రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేట్లోని టెక్నికల్ సర్వీసెస్లో జీఎం వి.రామమూర్తిని డైరెక్టర్ ఈ అండ్ ఎం విభాగానికి, జైపూర్లోని ఎస్టీపీపీ పీసీఎస్ జీఎం కొండారెడ్డి శ్రీనివాసులు ఎస్టీపీపీ ఈఅండ్ఎంకు, కార్పొరేట్లోని ఎంపీ డిపార్ట్మెంట్ అడిషినల్ జీఎం పి.మురళీకృష్ణను టెక్నికల్ సర్వీసెస్కు, ఆర్జీ–2 ఏరియా ఇంజనీర్ నర్సింహరావును జైపూర్లో ఎస్టీపీపీకి బదిలీచేశారు. వీరందరూ ఈ నెల 21వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.