
స్కూటీని ఢీకొట్టిన లారీ
బూర్గంపాడు: సారపాకలోని ఆర్చీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీసీ రిటైర్డ్ ఉద్యోగి మృతిచెందాడు. సారపాకలోని మసీద్ రోడ్డులో నివాసముంటున్న గంగుల రాజేశ్వరరావు(65) గురువారం సాయంత్రం సారపాక సెంటర్ నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో భద్రాచలం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో రాజేశ్వరరావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ చక్రాల కిందపడటంతో సుమారు 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లడంతో శరీరం ఛిద్రమైంది. అతనిని గుర్తు పట్టేందుకు స్థానికులకు కూడా అరగంట సమయం పట్టింది. ఎస్ఐ రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతుడు రాజేశ్వరరావు ఐటీసీ పీఎస్పీడీలో రా మెటీరియల్ విభాగంలో మేనేజర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టగా వాహనదారుడు మృతి చెందాడు. సత్తుపల్లి శివారులో గురువారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం కుమురంభీం కాలనీకి చెందిన ఊకే రాము(45), ఏసుబాబు సత్తుపల్లి నుంచి గంగారంవైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఏలూరు వెళ్తూ పట్టణ శివారు పెద్ద వంతెన సమీపా వీరి వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమాన్ని తాకడంతో ఊరే రాము బస్సు వెనుక టైర్ల కిందపడగా తీవ్రగాయాలతో మృతి చెందాడు. అలాగే, ఏసుబాబు కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాము భార్య నాలుగేళ్ల క్రితం మృతిచెందగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో తల్లిని ఇప్పుడు తండ్రిని కోల్పోయిన కుమార్తెలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.
ట్రాక్టర్ పైనుంచి పడి డ్రైవర్..
తిరుమలాయపాలెం: దుక్కి దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడు. మండలంలోని పిండిప్రోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కిలారు ఉపేందర్(39) బుధవారం మధ్యాహ్నం ఓ రైతు చేను దున్నేందుకు వెళ్లాడు. ఈక్రమాన ట్రాక్టర్ బండరాయిపైకి ఎక్కడంతో అదుపు తప్పగా కింద పడిన ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఖమ్మంకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. ఉపేందర్కు భార్య త్రివేణి ఉండగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రిటైర్డ్ ఐటీసీ ఉద్యోగి మృతి

స్కూటీని ఢీకొట్టిన లారీ