
కేసీఆర్ను కలిసిన దిండిగాల
ఇల్లెందు: మాజీ సీఎం కేసీఆర్ను హైదరాబాద్లోన ఆయన ఇంటి వద్ద ఇల్లెందు బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, పాలనలో విఫలమైందని ఆరోపించారు.
అటవీ సంపదను
ధ్వంసం చేస్తే చర్యలు
దుమ్ముగూడెం: అటవీసంపదను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధి కారులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. దుమ్ముగూడెం మండలంలో అటవీ అధికారుల విధులను అడ్డుకుని, ప్లాంటేషన్ ధ్వంసం చేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేయగా, కాక సమ్మయ్య అనే వ్యక్తిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఏడు రోజుల రిమాండ్ విధించారని తెలి పారు. గొంది కమల అనే మహిళను స్వంత పూచీకత్తుపై విడుదల చేశామని పేర్కొన్నారు.
కుమారుడు
అన్నం పెట్టలేదని ఫిర్యాదు
తల్లాడ: గొడవ పడిన తన కుమారుడు భోజనం పెట్టలేదంటూ ఓ తల్లిని పోలీసులను ఆశ్రయించింది. తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన చల్లా తిరపతమ్మకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు జరగగా కుమారుడైన చల్లా అశోక్(తంబి) వద్ద ఆమె ఉంటోంది. అయితే, బుధవారం తల్లితో గొడవపడిన ఆయన భోజనం పెట్టకపోవడంతో తిరపతమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు అశోక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.
అథ్లెటిక్స్ అకాడమీలో
ప్రవేశానికి పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపికకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని పది జిల్లాలనుంచి 30 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల క్రీడాకారులు హాజరుకాగా, సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం ఫిజికల్ టెస్ట్, ఈవెంట్లలో పోటీలు నిర్వమించారు. ఈమేరకు ప్రతిభతో పాటు వైద్య పరీక్షల అనంతరం అర్హులకు అకాడమీ లో ప్రవేశం కల్పించనున్నారు.డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్కోచ్ ఎం.డీ.గౌస్, కోచ్లు ఎం.శ్రీనివాసరావు, ఎం.డీ.అక్బర్ అలీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్, మేనేజర్ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.