బాలలు బడిలోనే ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాలలు బడిలోనే ఉండాలి

Jun 13 2025 5:15 AM | Updated on Jun 13 2025 5:15 AM

బాలలు బడిలోనే ఉండాలి

బాలలు బడిలోనే ఉండాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): బడి ఈడు బాలలందరూ బడిలో ఉండాలని, బాలకార్మికులుగా ఎవ రూ మిగిలి పోకూడదని జిల్లా అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ అన్నారు. ప్రపంచ బాలకార్మి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం యాక్షన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎయిడ్‌) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడిఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపా రు. బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలుత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎండి షర్ఫుద్ధీన్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరికుమారి, డీసీపీయూ యూనిట్‌ బాధ్యులు అజీజ్‌, నాగరాజు, ఎయిడ్‌ సంస్థ జిల్లా కోఆర్డినేటర్‌ వి.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement