
హెచ్ఎం పిల్లలిద్దరూ ప్రభుత్వ పాఠశాలలోనే..
టేకులపల్లి: మండలంలోని గోలియాతండా పంచాయతీ వాగొడ్డుతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాణోతు లక్ష్మా(దివ్యాంగుడు) తన పాఠశాలలోనే ఐదో తరగతి పూర్తి చేసిన కుమారుడిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించాడు. కూతురిని ఇప్పటికే టేకులపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిస్తున్నాడు. ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ పలువురుగా ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా లక్ష్మాను హైస్కూల్ హెచ్ఎం మేరుగు శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. తుమ్మలచెలక హెచ్ఎం పూల్సింగ్ చొరవ తీసుకుని గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్న ఎనిమింది మంది విద్యార్థులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేర్పించారు. పాఠశాలల పునః ప్రారంభం రోజు గురువారం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పూలు , పెన్నులు, పెన్సిళ్లు , ఎరేజర్లు అందజేసి స్వాగతించారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. హెచ్ఎం జర్పల పద్మ, ఉపాధ్యాయులు నీరజ షారోన్తోపాటు లోగాని శ్రీనివాస్, మహమ్మద్ ఖాసిం, జ్యోతి రాణి పాల్గొన్నారు.