
ఏరువాక సాగారో...
జేష్ఠ మాస పౌర్ణమి(ఏరువాక పౌర్ణమి) సందర్భంగా జిల్లా రైతులు బుధవారం సాగు పనులను మొదలుపెట్టారు. ఉదయమే పశువులు, నాగళు, ట్రాక్టర్లతో పొలాలకు చేరుకుని పూజలు చేశారు. రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో పీఏసీఎస్ చైర్మన్ మందడపు సుధాకర్ పలువురు రైతులతో కలిసి పూజలు చేయడంతో పాటు మహిళలకు సారె పెట్టి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. నీటి సంఘం మాజీ చైర్మన్ మాధవరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, బాలు తదితరులు పాల్గొన్నారు. ఇక నేలకొండపల్లి తదితర మండలాల్లో కూడా రైతులు దుక్కులు దున్ని సాగు పనులు మొదలపెట్టారు. – రఘునాథపాలెం