
ప్రజారోగ్యంపై దృష్టి పెట్టండి
కొత్తగూడెంఅర్బన్ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ప్రొఫెసర్ డాక్టర్ శివకామి ముత్తుస్వామి, హైదరాబాద్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వరలక్ష్మి పాల్గొని గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవల గురించి వివరించారు.
రోటోసిల్ వ్యాక్సిన్ ప్రారంభం..
లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పీహెచ్సీలో రోటోసిల్ వ్యాక్సిన్ను డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల్లో విరేచనాల నివారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాక్సిన్ను తగిన మోతాదులో షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు తేజశ్రీ, స్వప్న, జి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్