
కేంద్ర పథకాలు గిరిజనులకు అందేలా కృషి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. హైదరాబాద్లోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి ఆ శాఖ డిప్యూటీ సెక్రటరీ గణేష్ నాగరాజన్ రాష్ట్రంలోని డీడీ, డీటీడీఓలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు. గిరిజన కుటుంబాలకు ధర్తీ అభ, జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ జిల్లాలో 20 మండలాల్లోని 130 గ్రామాల్లో ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామసభలు ఏర్పాటు చేస్తామని, పీవీటీజీ గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అన్ని గుర్తింపు కార్డులు ప్రతి కుటుంబంలో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.