
విద్యుత్ మోటార్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
సుజాతనగర్: వ్యవసాయ విద్యుత్ మోటార్ను చోరీ చేసిన ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సింహాసాగర్ గ్రామానికి చెందిన లావుడ్యా తులసీరాం పొలంలోని విద్యుత్ మోటార్ గత నెల 8న చోరీకి గురైంది. బాధిత రైతు గత నెల 26న ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం ఎస్ఐ రమాదేవి, సిబ్బందితో కలిసి నర్సింహాసాగర్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టగా గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించారు. దీంతో విద్యుత్ మోటార్ను చోరీ చేసి, సుజాతనగర్ గ్రామ శివారులో ఉన్న స్క్రాప్ దుకాణ యజమాని కోమారి అప్పారావుకు రూ.3 వేలకు విక్రయించినట్లు తెలిపారు. దీంతో వారితోపాటు మోటార్ను కొనుగోలు చేసిన అప్పారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు.