ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి.. | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి..

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి..

ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి..

కల్లూరురూరల్‌: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని, అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కాలువ సుజాత, ఏపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్‌ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పసుమర్తి చందర్‌రావు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో కూడా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రఅధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా చందర్‌రావుతోపాటు ప్రధాన కార్యదర్శులుగా గోళ్ల రాధాకృష్ణ, వనమా కిరణ్‌, ఉపాధ్యక్షుడుగా వీరదల్లి రాజేశ్‌, నూకల శ్రీనివాసరావు, కోశాధికారిగా పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా కొప్పరపు బలరాం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గంగిశెట్టి జగదీశ్‌కుమార్‌, నాగుబండి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలిగా దోసపాటి సంధ్యారాణి, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పసుమర్తి రాంబాబు, ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement