
మణుగూరులో 117 శాతం బొగ్గు ఉత్పత్తి
మణుగూరుటౌన్: ఏరియాలో ఏప్రిల్లో 9.26 లక్షల టన్నుల లక్ష్యానికి 10.88 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, 117 శాతం నమోదు చేసినట్లు మణుగూరు జీఎందుర్గంరాంచందర్తెలిపారు.బుధవారనిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్లో ఓబీ 15 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను13.33లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీశామన్నారు. మణుగూరు ఓసీ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అధికారులు లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, శ్రీనివాసచారి, అనురాధ, శేషగిరి, బాబుల్ రాజు, రమేశ్, సింగు శ్రీనివాస్ పాల్గొన్నారు.