నాటుసారా స్థావరాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

నాటుసారా స్థావరాలపై దాడులు

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

నాటుసారా  స్థావరాలపై దాడులు

నాటుసారా స్థావరాలపై దాడులు

కరకగూడెం: నాటుసారా తయారు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎకై ్సజ్‌ సీఐ రాజిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. విప్పలగుంపులో ఓ ఇంట్లో సారా తయారీకి ఉపయోగించే సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. 9 మంది సారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీ ల్దార్‌ కాంతయ్య ఎదుట బైండోవర్‌ చేశారు. కార్యక్రమంలో హెచ్‌సీ అష్రఫ్‌, సిబ్బంది ఆంజనేయులు, ధనజ్యోతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు

ఇల్లెందు: పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన సైదులుపై అదే గ్రామానికి చెందిన యాకూబ్‌పాషా, సోని దాడి చేసి గాయపర్చారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హసీనా కేసు నమోదు చేశారు.

విద్యార్థిని అదృశ్యం

పాల్వంచరూరల్‌: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బట్టలు, ల్యాప్‌ట్యాప్‌ను సర్దుకుని ఓ విద్యార్థిని వెళ్లిపోయింది. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన ఓపెన్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని (19) మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయందని, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని తండ్రి శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై

కేసు నమోదు

ఇల్లెందురూరల్‌: మండలంలోని కొమరారం గ్రామంలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంగళవారం ఎస్‌ఐ నాగుల్‌మీరా కేసు నమోదు చేశారు. మాణిక్యారం గ్రామానికి చెందిన గడదాసు గణేశ్‌ బైక్‌పై పోలారం నుంచి మాణిక్యారం వెళ్తూ కొమరారంలో ఎదురుగా స్కూటీపై వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలు తీవ్రంగా గాయపడగా.. ఆయన కుమారుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement