
కన్నీటితో హాజరై.. ఉత్తమ ఫలితాలు
పరీక్షల ప్రారంభం రోజే
బాలికల తండ్రి మృతి
ఇల్లెందురూరల్: తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉండి.. కన్నీటిని దిగమింగుతూ పదో తరగతి పరీక్షలు రాసిన అక్కాచెల్లెళ్లు బుధవారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని కల్తిరామయ్య గుంపు గ్రామానికి చెందిన కనపటి హర్షిత, ప్రియ రొంపేడు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. పరీక్షలు ప్రారంభమైన రోజే తండ్రి వీరస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ వార్త కూతుర్లకు తెలియనీయకుండా జాగ్రత్త పడిన కుటుంబ సభ్యులు, ఆశ్రమ ఉపాధ్యాయులు.. పరీక్ష పూర్తి కాగానే ఇంటికి తీసుకెళ్లి తండ్రి భౌతికకాయాన్ని చూపించారు. ఆరోజు అంత్యక్రియలు పూర్తి కాగా, అందరూ ధైర్యం చెప్పి మిగితా పరీక్షలు కూడా రాయించారు. కాగా హర్షిత 355, ప్రియ 388 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.

కన్నీటితో హాజరై.. ఉత్తమ ఫలితాలు