
ఏపీ ఈఏపీసెట్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల వారీగా వి. రూపశ్రీ (40)వ ర్యాంకు, ఎన్. రక్షిత్ ఇన్నా (72), షేక్ నిహాల్ పర్వేజ్ (74), ఓ. సుష్మ కౌస్తుభరాణి (96), జి. శ్రీలేఖ (110), ఎండీ గబీష్ ఐమన్ (298)వ ర్యాంకు సాధించారని తెలిపారు. వెయ్యిలోపు (96), రెండువేల లోపు (147), ఐదువేల లోపు (358) ర్యాంకులతో పాటు 10వేల లోపు (763) ర్యాంకులు సాధించామని చెప్పారు. ఆయా ర్యాంకులతో 98 శాతం మంది విద్యార్థులు ఈఏపీ సెట్లో అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా డీన్లు కిశోర్, సురేష్, చంద్రశేఖర్, కృష్ణ, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, అన్ని క్యాంపస్ల ప్రిన్సిపాల్స్, ర్యాంకర్లకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు.