నిలువు‘దోపిడీ’ | - | Sakshi
Sakshi News home page

నిలువు‘దోపిడీ’

Jun 10 2025 7:06 AM | Updated on Jun 10 2025 7:06 AM

నిలువు‘దోపిడీ’

నిలువు‘దోపిడీ’

దేవుడి సన్నిధిలో

ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన ఆలయాల్లో అవినీతి తాండవిస్తోంది. భక్తుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని దుకాణదారులు దోపిడీ చేస్తున్నారు. గుడిలో అడుగు పెట్టింది మొదలు చదివించుకోవాల్సిందే. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన ఆలయ అధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఆలయాల నిర్వహణ అధ్వానంగా మారింది. పట్టించుకోవాల్సిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

పట్నంబజారు: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అవినీతి అడ్డూ అదుపు లేకుండా పోయింది. భక్తులకు సిబ్బంది కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల కిందట గుంటూరుకు చెందిన ఒక కుటుంబం ఆలయానికి వచ్చింది. రూ. 400తో అభిషేకం టికెట్‌ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పూజ సామగ్రి కిట్‌ కొనుగోలుకు వెళ్లింది. రూ. 300 అని చెప్పడంతో కంగుతిన్నారు. చిన్న సైజు రెండు కొబ్బరికాయలు, నాలుగు గులాబి పువ్వులు, ఐదు రూపాయలు విలువ చేసే సాంబ్రాణి కడ్డీల ప్యాకెట్‌, పది రూపాయల పాల ప్యాకెట్‌ ఉన్న కిట్టుకు రూ. 300 వసూలు చేయడంతో భక్తులు ప్రశ్నించారు. ఇష్టముంటే కొనుక్కో..లేకపోతే లేదంటూ దుకాణదారుడు మండిపడ్డాడు. కనీసం ఆలయంలో కూడా రేట్ల పట్టిక బోర్డులు లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

పొంగలికి విచిత్రమైన రేట్లు

పొంగలి విషయంలోనూ వ్యాపారులకు వత్తాసుగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. తడి బియ్యం అర కిలో లోపు రూ. 70, కిలో లోపు రూ. 100, కిలో దాటి రూ. 150 అంటూ.. విచిత్ర రేట్లు ఫిక్స్‌ చేశారు. గ్యాస్‌ సిలిండర్‌, స్టౌ, పలు సామాన్లు అందించాల్సిన కాంట్రాక్టర్‌ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు.

అధికార పార్టీ వ్యక్తి హల్‌చల్‌

తీరా టికెట్‌ కొనుగోలు చేసి వెళితే క్యూలైన్‌ దగ్గర ఉండే ఒక వ్యక్తి ‘‘అడపా’’ దడపా ‘‘లక్ష్మణ’’ రేఖ గీస్తుంటాడు. ఆలయంలో అంత తాను చెప్పిన విధంగానే జరగాలంటూ.. అధికార పార్టీకి చెందిన వ్యక్తినంటూ హల్‌చల్‌ సృష్టిస్తున్నాడు. అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించి కొంత మంది సిబ్బంది నేరుగా డబ్బులు వారి జేబుల్లో వేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మద్యం తాగి అర్ధరాత్రులు విధుల్లోకి వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయ అర్చకులు, సిబ్బంది కై ంకర్యం

● పొన్నూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేవదాయ శాఖకు చెందాల్సిన సొమ్మును ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి కై ంకర్యం చేస్తున్నారు. నేరుగా అర్చకుడి వద్దకు వచ్చి ఇవ్వాళ్ల టోకెన్ల వాటా ఏదీ అంటూ.. భక్తుల ముందే అటెండర్లు తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. భక్తులు క్యూలో నిలబడి ఉన్న సమయంలో అర్చకులు వారి డబ్బులు లెక్క వేసుకుని, అటెండర్లకు ఇచ్చే పని తప్పా భక్తులను పట్టించుకోకపోవడం దారుణం. టికెట్‌ కొనుగోలు చేసి వచ్చిన వారికి కనీసం గోత్ర, నామాలు కూడా చెప్పకుండా, అటెండర్లు తీసుకునివచ్చిన వారికి, అర్చకులు విజిటింగ్‌ కార్డులు ఇచ్చి పిలిపించుకున్న వారికి మాత్రమే అధిక ప్రాధాన్యం లభిస్తోంది.

● గుంటూరు వేంకటేశ్వరస్వామి ఆలయం, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కంఠంరాజు కొండూరు, వైకుంఠపురంతో పాటు అనేక ప్రధాన ఆలయాల్లో వేలం పాటల్లో దుకాణాలు దక్కించుకున్న వారు కనీసం రేట్ల పట్టికలు కూడా పెట్టడం లేదు. ఇష్టానుసారంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల ఉన్న పరిస్థితిని బట్టి రూ. 100 నుంచి రూ. 300పైగానే పూజా కిట్లను అమ్ముతున్నారు.

జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో దుకాణదారుల దందా పూజ సామగ్రి అధిక ధరలకు అమ్మకం చోద్యం చూస్తున్న అధికారులు

చర్యలు తీసుకుంటాం

ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా సిబ్బంది నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక విజిలెన్స్‌ సిబ్బందిని ఏర్పాటు చేసి, షాపులు, పొంగలి షెడ్డులో అధిక రేట్లు వసూళ్లకు పాల్పడకుండా చర్యలు చేపడతాం.

– లీలాకుమార్‌, కాకాని శివాలయం, కార్యనిర్వాహణధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement