మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.20 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ కు 5,292 క్యూసెక్కులు విడుదలవుతోంది.
శివాలయానికి బారికేడ్లు విరాళం
పెదకాకాని: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఇర్లపాడుకి చెందిన ఆరుమళ్ల వెంకటరావు, అనూష దంపతులు 25 బారికేడ్లను శివాలయానికి సోమవారం అందజేశారు.
గుట్టలు తొలగించేది ఎప్పుడో!
తెనాలి అర్బన్: పట్టణంలోని తూర్పు కాల్వలో వ్యర్థాలను తొలగించి రోడ్డు పక్కనే పడే శారు. పది రోజులు దాటుతున్నా తొలగించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
నడి రోడ్డున పడ్డాం
వాస్తవంగా 2027 వరకు ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో మేమంతా జీవనోపాధి కోల్పోయి నడిరోడ్డున పడ్డాం. జిల్లాలో 294 మంది ఎండీయూ వాహనాల ఆపరేటర్లగా పని చేస్తున్నాం. గతంలో మాకు వాహనమిత్ర కింద అందించే రూ. 10 వేలతో బ్రేక్, ఇన్స్యూరెన్స్ చేయించుకునే వాళ్లం. ఈ ఏడాది జనవరిలో మా అకౌంట్ నుంచి ఇన్స్యూరెన్స్ కింద
రూ. 8773 కట్ చేశారు. వాహనం బ్రేక్ చేయాలంటే మరలా రూ. 20 వేలు కట్టాలంటున్నారు. ప్రస్తుతం వాహనాలను ఏం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు.
– గొరిపర్తి గోపి, ఎండీయూ యూనియన్ అధ్యక్షులు, రేపల్లె మండలం
కలెక్టర్ను కలిసినా ఫలితం శూన్యం
నేను పమిడిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా 2008లో చేరా. ఇప్పటికి 16 సంవత్సరాలుగా పని చేస్తున్నా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను పని చేసుకుంటూనే ఉన్నా. పాఠశాలలు తెరిచిన తర్వాత యథావిధిగా వెళ్లా.
జూన్ 16న హెచ్ఎం పట్టాభిరామిరెడ్డి తమకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని, విధులు నుంచి తొలగాలన్నారు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పలేదు. జూన్ 21న నన్ను విధుల నుంచి తొలగించారు. అప్పటినుంచి ఎంఈవో, డీఈవోల వద్దకు తిరిగినా ప్రయోజనం లేదు. కలెక్టర్కు ఇప్పటికి మూడు సార్లు అర్జీలు ఇచ్చా. అయినా ఫలితం లేదు.
– బేతంశెట్టి కనకమ్మ, మధ్యాహ్న భోజన
నిర్వాహకురాలు పమిడిపాడు కొరిశపాడు మండలం
ఇంటికొచ్చి తల పగలకొట్టారు
నేను 20 ఏళ్లుగా తొట్టెంపూడిలో యానిమేటర్గా పని చేస్తున్నా. నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. నా కుటుంబ సభ్యులు కూడా వాటికి దూరంగా ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను విధుల నుంచి తప్పుకోమన్నారు. నేను ఎందుకని అడిగాను? సమాధానం చెప్పలేదు. టీడీపీకి చెందిన జాలాది సురేష్బాబు, ఆయన భార్య వాణి, పద్మ మా ఇంటి కొచ్చి నా భర్త ముసలయ్య, మా అమ్మ కమలమ్మలపై దాడి చేసి తల పగలకొట్టారు. నన్ను కిందపడేసి వారికిష్టమొచ్చినట్లు కొట్టారు. పైగా నా భర్తపై రేప్ కేసు పెట్టారు. పోలీసులు కూడా వారికే అనుకూలంగా వ్యవహరించారు.
–తమనం సునీత, తొట్టెంపూడి, చుండూరు మండలం
మా పొట్టకొట్టడం సరికాదు
అప్పు చేసి మరీ వాహనాలను కొన్నాం. మమ్ములను విధుల నుంచి తొలగించి మా పొట్టపై కొట్టడం దారుణం. ఇప్పటికి మేము మొబైల్ వ్యాన్ ఆపరేటర్లుగా నాలుగున్నరేళ్లు పాటు సేవలు అందించాం. ఈ ఉద్యోగం భవిష్యత్లో బాగుంటుందని, ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి వచ్చేశాం. ప్రతి నెలా మాకు రూ.21 వేల జీతం వచ్చేది. మమ్మల్ని ఇప్పుడు అర్ధంతరంగా తొలగించడంతో భయమేస్తోంది.
– పేర్లి రమేష్,
యూనియన్ అధ్యక్షులు, వేటపాలెం మండలం
I
న్యూస్రీల్
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల