పశువులకు గాలికుంటు నివారణ టీకా వేయించాలి | - | Sakshi
Sakshi News home page

పశువులకు గాలికుంటు నివారణ టీకా వేయించాలి

Mar 25 2023 2:08 AM | Updated on Mar 25 2023 2:08 AM

గాలికుంటు వ్యాధి టీకా వాల్‌పోస్టర్లను 
ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌    - Sakshi

గాలికుంటు వ్యాధి టీకా వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

బాపట్ల: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పశుపోషకులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గాలికుంటు వ్యాధి నివారణ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 24వ తేదీ వరకు వ్యాధి నివారణ టీకా వేయించాలని సూచించారు. జిల్లాలో 25 మండలాల్లో 75 బృందాలను ఏర్పాటు చేయగా, వాటిలో 411 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే 3,38,650 డోసుల టీకా పశువైద్యశాలలకు అందించామని జేడీఏ అబ్దుల్‌సత్తార్‌ తెలిపారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement