
సాక్షి,అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 21) ఆయనకు వైఎస్ జగన్ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ‘తెలుగు సాహిత్యానికి వేగుచుక్క, అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించి మహిళాభ్యుదయానికి పాటుపడిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
తెలుగు సాహిత్యానికి వేగుచుక్క, అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించి మహిళాభ్యుదయానికి పాటుపడిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/1SW9yN8w0v
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2025