శ్రీవారి దర్శనానికి 18 గంటలు | Tirumala: Srivari darshan to take 18 hours amid rush | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Sep 21 2025 5:09 AM | Updated on Sep 21 2025 5:09 AM

Tirumala: Srivari darshan to take 18 hours amid rush

తిరుమల: తిరుమల­లో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శు­క్రవారం అర్ధరాత్రి వరకు 71,249 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.04 కోట్లు సమర్పించారు.

టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement