ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు: సీఎం జగన్‌

Published Mon, Oct 25 2021 12:05 PM

AP: CM YS Jagan‌ Review Meeting on Higher Education - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో చర్చించిన అంశాలు.. 

ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి
మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ అన్నది నిరంతరం కొనసాగాలి. 
కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలి. అప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి.
ఎడ్యుకేషనల్‌గా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటి అన్నది కనిపించాలి.
ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. జాబ్‌ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి.
ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాం.
చదువులున్నా.. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం.
అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి.
ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకు వస్తున్నాం.
సర్టిఫైడ్‌కోర్సులను కరికులమ్‌లో భాగంగా చేయాలి.
ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి.
చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి.
యూనివర్శిటీల్లో టీచింగ్‌స్టాఫ్‌ను రిక్రూట్‌చేయమని ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ఇచ్చాం.
టీచింగ్‌స్టాఫ్‌లేనప్పుడు యూనివర్శిటీలు ఉన్నా.. లాభం ఏంటి.
రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు.
టీచింగ్‌స్టాఫ్‌లో క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌చేసినా అర్థం ఉండదు.
అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి. అత్యంత పారదర్శకంగా నియమాకాలు సాగాలి.
క్వాలిటీ ఎడ్యుకేషన్‌కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రాక్టికాలిటీకి పెద్దపీట వేయాలి.

జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం
ఆస్పత్రులను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం.
అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలోకూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి.
కాలేజీలన్నీ కూడా ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలి.
ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రియింబర్స్‌మెంట్‌విషయంలో ఎక్కడా లోటు చేయడంలేదు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నాం.
ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంవల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాలనుంచి రాకుండా చూసుకుంటున్నాం.
తల్లుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం.
కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు.
యూనివర్శిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజురియింబర్స్‌మెంట్‌ఫీజులు కూడా ఇస్తాం.
ఇతర ప్రైవేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం.
దీనివల్ల ఆర్థికంగా యూనివర్శిటీలు స్వయం స్వయంసమృద్ధి సాధిస్తాయి.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ కావాలి
పరిశోధనలమీద కూడా కొలాబరేట్‌చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి.
ఒక్కో యూనివర్శిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌కావాలి.
ప్రతి వారం ఒక వీసీని పిలిపించుకుని... యూనివర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చొని చర్చించాలి. ఆ సమావేశంలో గుర్తించినా అంశాలను నా దృష్టికి తీసుకురావాలి.
తర్వాత యూనివర్శిటీ వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
వచ్చే మూడు సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించి మూడేళ్లలో విజన్‌ సాధించాలి.
అన్నియూనివర్శిటీల్లో నాక్‌రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలి.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు యూనివర్శిటీలతో ఇంటిగ్రేడ్‌ కావాలి.
ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌కోర్సులను ఉంచాలి.
ఇంగ్లిషును మెరుగుపరచడంపైనా దృష్టిపెట్టాలి.
బేసిక్‌ఇంగ్లీష్‌ అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలి.
దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్
తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మాద్యమంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్న సీఎం.. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ అందించాలని తెలిపారు. ‘‘ఈ ప్రభుత్వం చదువకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య ఇవ్వడానికే అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు అన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నవారికి ల్యాటాప్‌లు ఇవ్వనున్నామని అధికారులు తెలిపారు.

ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు: సీఎం
ప్రతి కాలేజీలో ప్రమాణాలు పాటించాల్సిందే. ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే.. గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి.. మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి.
ప్రమాణాలు లేని వాటికి అనుమతులు ఇవ్వొద్దు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీకాలేజీ
గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌క్లినిక్స్‌లాంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనియేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలి.
అలాగే సబ్‌రిజిస్ట్రార్, టౌన్‌ప్లానింగ్‌విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైన అధ్యయనం చేయాలి.
యూనివర్శిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్‌ చేయాలి.
సబ్జెక్టుల వారీగా ఇలా రికార్డ్‌ చేసి.. వీటిని ఆన్‌లైన్లో పెట్టాలి.
విద్యార్థులు సులభంగా అర్థంచేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండాలి.

ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు
ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం.
శిథిలావస్థలో, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి వారికి ఒక అవకాశ ప్రభుత్వం పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
లేదు తామే నడుపుకుంటామే భేషుగ్గా నడుపుకోవచ్చుదీనికి ఎలాంటి అభ్యంతరం లేదు.
ప్రభుత్వానికి ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి:

చదవండి: నవంబర్‌ 1న వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం

Advertisement
Advertisement