ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

Published Sun, Jan 17 2021 9:01 PM

161 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,091 మందికి కరోనా పరీక్షలు చేయగా 161 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,985కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 251 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,76,949  మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,896. వైరస్‌ బాధితుల్లో కొత్తగా ఒకరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7,140కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement
Advertisement