
కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉంది.
విత్తన వేరుశన
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ప్రారంభం కానున్న కీలకమైన ఖరీఫ్కు సంబంధించి అన్నదాతకు రాయితీ విత్తనాలు అందకుండా కూటమి సర్కారు కత్తెర వేసింది. ప్రతిపాదిత విత్తన ప్రణాళికను పక్కనపెట్టి మూడో వంతు కత్తెర వేసి నామమాత్రంగా కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో రానున్న ఖరీఫ్లో విత్తనం కోసం రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. అసలే కరువు పరిస్థితులు, ప్రభుత్వం నయాపైసా సాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కష్టసమయంలో కనీసం విత్తనాలు కూడా సక్రమంగా అందివ్వకపోవడంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1,51,978 క్వింటాళ్లు రాయితీ విత్తనాలు కేటాయించాలని ప్రతిపాదనలు పంపగా... కొర్రీలు వేసి చివరకు 54,184 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు.
అన్నింటిలో కోతలే..
ఖరీఫ్లో జిల్లా రైతులకు రాయితీతో 1,51,978 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపారు. సాధారణంగా జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనలు యథావిధిగా ఆమోదిస్తూ అనుమతించడం కొన్నేళ్లుగా జరుగుతోంది. అయితే ఈసారి ప్రతిపాదనలకు భారీగా కత్తెర వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్–2025కు సంబంధించి మొత్తంగా 1,51,698 క్వింటాళ్లు విత్తనాలు అవసరమని నివేదించారు. అందులో ప్రధాన పంట వేరుశనగ 1.45 లక్షల హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేసి 1,33,763 క్వింటాళ్లు రాయితీ విత్తన వేరుశనగ అవసరమని ప్రతిపాదించారు. అయితే కేవలం 50,592 క్వింటాళ్లు ఇచ్చారు. ఇలా... అన్ని రకాల విత్తనాలు బాగా తగ్గించేసి కేటాయింపులు చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
ఖరీఫ్ విత్తన కేటాయింపులు బాగా తగ్గించేస్తూ ఉత్తర్వులు
1,51,978 క్వింటాళ్లకు గానూ 54,184 క్వింటాళ్లకే అనుమతి
విత్తనాల కోసం అన్నదాతలు అవస్థలు పడాల్సిన దుస్థితి