●మత్తు వదలరా నాయనా.. | - | Sakshi
Sakshi News home page

●మత్తు వదలరా నాయనా..

Apr 26 2025 12:48 AM | Updated on Apr 26 2025 12:48 AM

●మత్తు వదలరా నాయనా..

●మత్తు వదలరా నాయనా..

తాడిపత్రిటౌన్‌: మత్తు వదలరా నాయనా అంటూ మందుబాబుకు తాడిపత్రి పట్టణ పోలీసులు నీటితో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. పట్టణంలోని నందలపాడులో సుంకన్న అనే వ్యక్తి శుక్రవారం మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సాయిప్రసాద్‌ అక్కడికి వెళ్లి మందుబాబును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే సుంకన్న పూటుగా మద్యం సేవించి మత్తులో తూగుతుండటంతో స్టేషన్‌ గేటు ముందు కుళాయి నీటి పైపుతో స్నానం చేయించారు. ఇది చూసిన ప్రజలు మందుబాబుతో పోలీసులకు ఎన్ని అవస్థలు వచ్చాయిరా నాయనా అంటూ చర్చించుకున్నారు. అయితే పోలీసులు స్నానం చేయించాక కాసేపు ఇక్కడే పడుకుంటా సార్‌ అని సుంకన్న పోలీసులను బతిమాలడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement