సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన

Apr 26 2025 12:48 AM | Updated on Apr 26 2025 12:48 AM

సజావు

సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన

అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల మెడికల్‌ సర్టిఫికేషన్‌ రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆస్పత్రిలోని డీఈఐసీ, బర్న్స్‌ వార్డు, ఆప్తాల్మిక్‌ వార్డుల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరిగింది. ఆర్థో హెచ్‌ఓడీ, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆత్మారాం, వైద్యులు డాక్టర్‌ ఆనంద్‌ బాబూ నాయక్‌, డాక్టర్‌ ప్రశాంతి, తదితరులు సర్టిఫికెట్లను పరిశీలించారు.

నలుగురు విద్యార్థుల డీబార్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, బీఈడీ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న నలుగురు విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ జీవీ రమణ తెలిపారు. అనంతపురం, తాడిపత్రిలో ఒక్కొక్కరు చొప్పున డిగ్రీ విద్యార్థి, తాడిపత్రిలో ఇద్దరు బీఈడీ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మే 5న జాతీయ

లోక్‌ అదాలత్‌

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మే 5న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఈ. శివప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా కోర్టు పరిధిలోని కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదం కేసులు, సివిల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, కుటుంబ తగాదాల (విడాకుల కేసులు కాకుండా) , పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగ్గ క్రిమినల్‌ కేసులు, వినియోగదారుల ఫోరం కేసులు, ప్రిలిటిగేషన్‌ తదితర కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ చేస్తామన్నారు. కక్షిదారులందరూ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

బుక్కరాయసముద్రం: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా రెండవ బెటాలియన్‌ ఎస్‌ఏపీ క్యాంప్‌లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందికి రేంజ్‌ల వారీగా క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జిల్లా ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ జట్టు బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌ పోటీల్లో విజయం సాధించింది. పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేత జట్టుకు ట్రోఫీలను ప్రవీణ్‌కుమార్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగమన్నారు. కార్యక్రమంలో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కేశవరెడ్డి, మహబూబ్‌బాషా బెటాలియన్‌ ఉద్యోగుల సంఘం నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన1
1/1

సజావుగా సర్టిఫికెట్ల పునః పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement