
త్వరలో పనులు ప్రారంభిస్తాం
రైవాడ జలాశయం అభివృద్ధికి రూ. 3 కోట్ల మంజూరయ్యాయి. గ్రావెల్తో జలాశయం గట్టు పటిష్టం చేశాం. కుడి, ఎడమ ప్రధాన పంట కాలువల్లో జంగిల్ క్లియరెన్స్, పూడికలు తొలగింపునకు, ఇంటెక్ చాంబర్ మరమ్మతు పనులకు అగ్రిమెంట్ పూర్తయ్యింది. పనులను వారంలోగా ప్రారంభిస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. పిల్ల కాలువల్లో తుప్పలు, పూడికలు తొలగించే పనులు ఆయా నీటి సంఘాలకు అప్పగించాం. తక్షణమే పనులు చేపట్టాలని సూచించాం.
–జి. సత్యంనాయుడు, డీఈ, రైవాడ జలాశయం