
చివరికి నీరందేనా?
● తప్పులు,డొంకలతో నిండిన రైవాడ కాలువలు ● ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పూడిక తొలగించని అధికారులు ● శివారు ఆయకట్టుకు నీరందని పరిస్థితి ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నా శివారు ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి దాపురించింది. జలాశయం నుంచి ఆయకట్టుకు నీరందించే పంట కాలువలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. జలాశయం కుడి, ఎడమ ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువలు సైతం తుప్పలు, డొంకలు, పూడికతో నిండిపోయాయి. దీంతో ఈ ఏడాది చివరి ఆయకట్టుకు సాగు నీరు ప్రశ్నార్థకంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జలాశయం పరిధిలోని సాగు నీటి కాలువల్లో పూడిక తీత, తుప్పలు తొలగింపు, మరమ్మతులు తదితర పనులు చేపట్టాల్సి ఉంటుంది. జలాశయం మట్టి గట్టు పటిష్టతతో పాటు కుడి, ఎడమ హెడ్ స్లూయిస్ అడుగు భాగంలో ఇనుప గేట్ల మరమ్మతులు, కుడి, ఎడమ కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ. 3 కోట్లు మంజూరయ్యాయి. గ్రావెల్తో జలాశయం గట్టు పటిష్టం చేసే పనులు చేపట్టిన అధికారులు కాలువల్లో తుప్పలు, డొంకలు, పూడికలు తొలగించే పనులు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నారుమడుల తయారీలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఎటువంటి పెట్టుబడి సహాయం అందించక పోయినప్పటికీ అప్పులు చేసి మరీ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారనుంది. జిల్లాలోనే వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ అన్నపూర్ణగా నిలిచిన రైవాడ జలాశయంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుష్కలంగా నీటి నిల్వలతో కళకళలాడుతున్న రైవాడ జలాశయం
పెదనందిపల్లి వద్ద తుప్పలు, డొంకలతో నిండిపోయిన రైవాడ జలాశయం పంట కాలువ
జలాశయం ఆయకట్టు వివరాలిలా...

చివరికి నీరందేనా?

చివరికి నీరందేనా?