రెండు ద్విచక్ర వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

Jun 2 2025 1:37 AM | Updated on Jun 2 2025 11:29 AM

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

దేవరాపల్లి: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీ కొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం దేవరాపల్లి నుంచి జీనబాడు వెళ్లే రహదారిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కివర్ల గ్రామానికి చెందిన కేత దేముడు దేవరాపల్లి నుంచి తన గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.

 అదే సమయంలో పెదబయలు నుంచి దేవరాపల్లి వైపు వస్తున్న ఎస్‌. ప్రసాద్‌ ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఇద్దరు తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్య సేవలు నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement