
ఏఎంసీకి వ్యాపారవేత్త గుప్తా పార్థివ దేహం
అనకాపల్లి: స్థానిక ఉప్పవారివీధికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పుష్కల గ్యాస్ కంపెనీ యజమాని కె.ఎల్.ఎన్.గుప్తా (85) మంగళవారం రాత్రి అనారోగ్య కారణంగా తన స్వగృహంలో మృతి చెందారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుప్తా పార్థివ దేహాన్ని విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి అందజేశారు. మృతుడి భార్య కె.అచ్యుతాంబ, మేనల్లుళ్లు విజయ్బాబు, కిరణ్ అనాటమీ హెచ్వోడీ డాక్టర్ రవీంద్ర కిషోర్కు గుప్తా మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం దానం చేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఏఎంసీకి వ్యాపారవేత్త గుప్తా పార్థివ దేహం