
వీడని రేషన్ కష్టాలు
అచ్యుతాపురం రూరల్/నాతవరం: రెండో రోజు కూడా జిల్లా ప్రజలను రేషన్ కష్టాలు వీడలేదు. మోసయ్యపేట గ్రామంలోని రేషన్ దుకాణంలో సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో వినియోగదారులు సోమవారం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇచ్చేవారని, ప్రభుత్వం మారడంతో ఇక్కట్లు కొనితెచ్చుకున్నట్లు అయిందని రేషన్ వినియోగదారులు వాపోతున్నారు. నాతవరం మండలంలో సర్వర్ సమస్యతో డీలర్లతోపాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షణే తప్ప వేలిముద్రలు పడటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడని రేషన్ కష్టాలు