
అడ్వాన్స్డ్లో అదరగొట్టారు
విశాఖ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2025 ఫలితాల్లో విశాఖ విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. పక్కా ప్రణాళికతో చదివామని, అధ్యాపకుల
సూచనలు, సలహాలు ఉపయోగపడ్డాయని విద్యార్థులు చెప్పారు. ఈ సందర్భంగా విజేతల నేపథ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుందాం.. –డాబాగార్డెన్స్/సీతంపేట/తగరపువలస
ప్రముఖ ఐఐటీలో చేరుతా..
మా నాన్న సురేష్ సుమార్ అనకాపల్లి జిల్లాలో ఏపీఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గాను, తల్లి వసుధ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్డ్లో 510వ ర్యాంకు సాధించాను. దేశంలోనే అత్యుత్తమ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో చేరుతాను.
–కొడవటి శివమ్రామ్ ప్రత్యూష్, 510 ర్యాంకు,
రోజుకు 13 గంటలపాటు చదివా..
రోజుకు 13 గంటలపాటు చదివా. ప్రతి వారం వీక్లీ టెస్ట్లకు అటెండయ్యా. డౌట్స్ను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునేవాడిని. తండ్రి ప్రసాదరావు, తల్లి వీణ.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. అధ్యాపకులు, యాజమాన్యం, తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నా.
–టి.మనోహర్, 116వ ర్యాంకు
చేపల వ్యాపారం చేస్తూ చదివించారు..
పదో తరగతి సింహాచలం గురుకుల పాఠశాలలో చదివి 588 మార్కులు సాధించాను. ఇంటర్ సీబీఎస్ఈలో 472/500 మార్కులు వచ్చాయి. మెయిన్స్లో 407వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 151వ ర్యాంకు వచ్చింది. నా తల్లిదండ్రులు అంజూరి శ్రీను, ఉమ మత్స్యకారులు. చేపల వ్యాపారం చేస్తూ చాలా కష్టపడి చదివించారు. ఖరగ్పూర్ లేదా ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి ఇంజనీర్ కావాలన్నది నా లక్ష్యం.
– అంజూరి తారక్రామ్, 151వ ర్యాంకు, పాండ్రంకి గ్రామం
పూర్ణ సాయికి 132వ ర్యాంక్
అనకాపల్లి టౌన్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో అనకాపల్లి నారాయణ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మామిడి పూర్ణసాయి 132వ ర్యాంక్ (ఓబీసీ కేటగిరీలో 18వ ర్యాంక్) సాధించాడు. బండారు యదు వంశీకి ఓపెన్ కేటగిరీలో 3,146 ర్యాంక్ దక్కింది. పూర్ణ సాయి తండ్రి శివనాగేశ్వరరావు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. తల్లి పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు.
డేవిడ్ జాన్సన్కు 1353వ ర్యాంకు
పాయకరావుపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థి దేవి డేవిడ్ జాన్సన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1353వ ర్యాంకు సాధించాడని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. డేవిడ్ జాన్సన్ మాట్లడుతూ స్పెషల్ కోచింగ్ ద్వారా తనను తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని విద్యా సంస్ధల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ఉపాధ్యాయ బృందం, సహచర విద్యార్థులు అభినందించారు.

అడ్వాన్స్డ్లో అదరగొట్టారు

అడ్వాన్స్డ్లో అదరగొట్టారు

అడ్వాన్స్డ్లో అదరగొట్టారు

అడ్వాన్స్డ్లో అదరగొట్టారు

అడ్వాన్స్డ్లో అదరగొట్టారు