
భక్తుల ఇలవేల్పు.. మాడుగుల మోదకొండమ్మ
పీజీఆర్ఎస్.. తూతూమంత్రం.!
IIలో
మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ జాతరను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి సతకంపట్టు వద్ద, ఆలయం వద్ద ఉదయం నుంచి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా భారీ విద్యుత్ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద టీవీ కళాకారులతో ప్రదర్శనలు, సతకంపట్టు వద్ద చిత్ర కళా ప్రదర్శన, దసరా స్టేజిపై చింతామణి, గయోపాఖ్యానం నాటకాలు, గవర వీధిలో విజయవాడ కళాకారులతో డ్యాన్స్ కార్యక్రమం జరగనున్నాయి. సతకంపట్టు వద్ద కొలువైన అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను చిత్ర విచిత్రమైన నేల వేషాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయానికి చేర్చడంతో అమ్మవారి నెల రోజుల పండగ ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు సోమవారంతో ముగిశాయి. క్రికెట్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1,25,000, ద్వితీయ బహుమతిగా రూ.80 వేలను మంగళవారం అందజేస్తారు.
నేటి జాతరకు ఘనంగా ఏర్పాట్లు
భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు

భక్తుల ఇలవేల్పు.. మాడుగుల మోదకొండమ్మ