
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు. వేసవి సెలవుల్లో భాగంగా ఇటీవల గ్రామానికి చేరుకున్న కృష్ణ మంగళవారం రాత్రి సోదరుని ఇంటి డాబాపైకి వెళ్లాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కృష్ణ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు కృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.