కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్య

Apr 4 2025 8:11 AM | Updated on Apr 4 2025 8:11 AM

కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్య

కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్య

నర్సీపట్నం: కుమారుడు మృతితో మానసిక క్షోభకు గురైన తల్లి ఆత్మహత్య చేసుకుందని పట్టణ సీఐ జి.గోవిందరావు తెలిపారు. పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన కోన గౌరి(50) చిన్న కుమారుడు 15 రోజుల క్రితం ఆకస్మికంగా మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లి గౌరి మానసిక క్షోభకు గురై తీవ్ర మనస్థాపంతో ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉద యం బలిఘట్టం ఉత్తరవాహిని నది లో ఆమె శవమై కనిపించింది. ఈ ఘటనపై మృతురాలు పెద్ద కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement