
కాయకల్ప బృందం ఏరియా ఆస్పత్రి సందర్శన
నర్సీపట్నం: కాయకల్ప అవార్డుల ఎంపిక కోసం వైద్యాధికారుల బృందం బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించింది. బృందం సభ్యులు సోనీ, వేణు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ వార్డు, ప్రసూతి విభాగం, బ్లడ్ బ్యాంక్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, కిచెన్, మార్చురీ, ఆర్వో ప్లాంట్ను పరిశీలించారు. ఆయా విభాగాల పనితీరు, అందిస్తున్న సేవల వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధా శారద, వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించిన బృందం సభ్యులు రోగుల నుంచి వివరాలు సేకరించారు.