అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

● శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం ● ఘనంగా గరుడసేవ

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

ఘనంగా గరుడసేవ.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ హవనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement