పయనమెలా? | - | Sakshi
Sakshi News home page

పయనమెలా?

Jun 29 2025 2:40 AM | Updated on Jun 29 2025 2:40 AM

పయనమె

పయనమెలా?

పొరుగు రాష్ట్రాలకు

గోదావరి, శబరి వరదలకు..

ఏటా గోదావరి, శబరి వరదల సమయంలో కూడా జాతీయ రహదారులు ముంపునకు గురవుతుండటంతో సుమారు 30 గ్రామాల ప్రజలు రాకపోకల సమస్య ఎదుర్కొంటున్నారు. వరద నీరు జాతీయ రహదారులను ముంచెత్తడతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌ ముంపులో

జాతీయ రహదారులు

రాష్ట్ర రహదారుల పరిస్థితి ఇంతే

ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత కరవు

గోదావరి, శబరి వరదల సమయంలో తప్పని అవస్థలు

చింతూరు: పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రహదారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్నా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చింతూరు డివిజన్‌లో గ్రామాలు, రహదారులతోపాటు ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారులు కూడా ముంపునకు గురి కానున్నాయి.

● పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్లో చింతూరు డివిజన్లో 43 గ్రామాలు, 45.72 కాంటూరు లెవెల్లో సుమారు 190 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

● ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే జాతీయ రహదారి–30తో పాటు ఆంధ్రా నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి–326 ముంపునకు గురవుతోంది.

● జాతీయ రహదారి–30 ఏటా వచ్చే వరదలకు భద్రాచలం వైపు చింతూరు మండలం చట్టివద్ద, ఎటపాక మండలం నెల్లిపాక వద్ద, ఛత్తీస్‌గఢ్‌ వైపు చిడుమూరు వద్ద మునిగిపోతోంది. జాతీయ రహదారి–326 కూడా ఒడిశా వైపు చింతూరు మండలం కుయిగూరు, కల్లేరు వద్ద కూడా అదే పరిస్థితి. దీనివల్ల రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

● చింతూరు డివిజన్లో చింతూరు నుంచి వీఆర్‌పురం, చింతూరు మండలం చట్టి నుంచి కూనవరం, కూనవరం నుంచి ఎటపాక మండలం నెల్లిపాక మీదుగా భద్రాచలం వెళ్లే రహదారులకు ముంపు తప్పడం లేదు. వీటితోపాటు చింతూరు నుంచి చట్టి, కూనవరం నుంచి వీఆర్‌పురం వెళ్లే రహదారి కూడా పోలవరం ముంపునకు గురవుతున్నాయి.

● పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆయా జాతీయ రహదారులు ముంపునకు గురైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారి–30లో భద్రాచలం వైపు చింతూరు మండలం చట్టి నుంచి సింగన్నగూడెం, ఛత్తీస్‌గఢ్‌ వైపు వీరాపురం నుంచి చిడుమూరు, ఎటపాక మండలంలో నెల్లిపాక, రాయనపేట, చోడవరం ప్రాంతాల్లో పోలవరం నీరు ముంచెత్తుతోంది.

పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల మునిగిపోనున్న ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే జాతీయ రహదారి–30

ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం

జాతీయ రహదారులు ఎక్కడైనా పోలవరం ముంపునకు గురయ్యే అవకాశముంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తాం. ప్రస్తుతం ఆంధ్రా నుండి ఒడిశా వెళ్లేందుకు నిర్మిస్తున్న జాతీయ రహదారి–326 ఎత్తులో ఉండేలా నిర్మిస్తున్నాం. ఇందుకు కుయిగూరు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాం. ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే జాతీయ రహదారి–30 కూడా ముంపునకు గురికాకుండా 45.72 కాంటూరు లెవెల్‌ కంటే ఎత్తులో ప్రణాళికతో చేపడుతున్నాం.

– చక్రవర్తి, ఏఈ, జాతీయ రహదారి

రాకపోకలు ఎలా సాగించాలి?

చింతూరు, కూనవరం మండలాల మధ్య ఉన్న మా పంచాయతీలో పలు గ్రామాలు పోలవరం ముంపులో లేవు. మా పక్కనే ఉన్న రహదారులు ముంపులో ఉంటే మేము ఇతర ప్రాంతాలకు ఎలా రాకపోకలు సాగించాలి. దీనిపై స్పష్టత ఇవ్వాలి. ముచ్చిక నాగార్జున,

కుమ్మూరు సర్పంచ్‌, చింతూరు మండలం

రహదారులు నిర్మించాలి

పోలవరం పూర్తయితే అటు చింతూరు, ఇటు నెల్లిపాక వద్ద రెండువైపులా జాతీయ రహదారి మునిగిపోతోంది. జాతీయ రహదారి మధ్యలో ఉన్న మా గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు ముందుగానే రహదారులు నిర్మించాలి.

– భూక్యా బాబూరావు, ఉపసర్పంచ్‌,

ఏడుగురాళ్లపల్లి, చింతూరు మండలం

పయనమెలా?1
1/4

పయనమెలా?

పయనమెలా?2
2/4

పయనమెలా?

పయనమెలా?3
3/4

పయనమెలా?

పయనమెలా?4
4/4

పయనమెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement