
గిరిజన విద్యార్థులు చదువుకు దూరం కారాదు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు లేక అరకు మండలం లోతేరు పంచాయతీ పరిధిలోని వంతులగుడ, తోడుబంద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తదితర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదన్న కథనాలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు విద్యావకాశాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరూ విద్యను అభ్యసించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల పాఠశాల విద్యపై క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేలా చూడాలన్నారు.
మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్
డాక్టర్ శంకరరావు