మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి.. | - | Sakshi
Sakshi News home page

మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..

Jun 23 2025 6:10 AM | Updated on Jun 23 2025 6:10 AM

మరణిం

మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..

పెందుర్తిలో మృతి చెందిన వ్యక్తి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు

పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన వ్యక్తి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటు కుంది ఓ కుటుంబం. పెందుర్తి సాయినగర్‌కు చెందిన రాపేటి నగేష్‌(45) ఆరోగ్యం క్షీణించి శనివారం రాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధి దాడి శ్రీనివాస్‌, స్థానిక పెద్దలు శరగడం మధు, పెంటకోట రమణ అక్కడకు వెళ్లి నగేష్‌ కళ్లు దానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు ఇచ్చినవారు అవుతారని కుటుంబ సభ్యులను ఒప్పించారు. వెంటనే భర్త నేత్రాలు దానం ఇచ్చేందుకు నగేష్‌ భార్య హిమబిందు అంగీకరిస్తూ సంతకం చేశారు. అక్కడకు చేరుకున్న ఎల్‌వీ ప్రసాద్‌ సారథ్యంలోని మోషన్‌ ఐ బ్యాంక్‌ ప్రతినిధులు నగేష్‌ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ నగేష్‌ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చూపిన తీరుపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.

మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..1
1/1

మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement