
బాకై ్సట్ అప్పగింత విరమించాలి
పాడేరు : జిల్లాలోని చింతపల్లి, అరకు, అనంతగిరి ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న బాకై ్సట్ను ఏపీ ఎంఎండీసీ, జాతీయ అల్యూమినియం అభివృద్ధి సంస్థ (నాల్కో)కు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించాలని, లేకుంటే మరోసారి ఆదివాసీలు ఉద్యమానికి దిగాల్సి వస్తుందని గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాకై ్సట్ను ఏపీ ఎంఎండీసీ, జాతీయ అల్యూమినియం అభివృద్ధి సంస్థ(నాల్కో)కు అప్పగిస్తున్నట్లు ఆదివారం పలు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. 2015 సెప్టెంబర్ 5న అప్పటి సీఎం చంద్రబాబు చింతపల్లి మండలం జర్రెల బ్లాక్లో 1521 హెక్టార్ల బాకై ్సట్ నిక్షేపాలు ఏపీ ఎంఎండీసీకి లీజుకు అప్పగిస్తూ జీవో నంబరు 97ను విడుదల చేసి గిరిజన సమాజాన్ని భయంబ్రాంతులకు గురి చేశారన్నారు. గిరిజనులు, అప్పటి ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెం.97ను పూర్తిగా రద్దు చేసిందన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి గిరిజనులను మళ్లీ భయంబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చి గిరిజనుల్లో మనోధైర్యం నింపాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, గిరిజన సంఘం, ఇతర ఆదివాసీ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణారావు, నాయకులు లింగమూర్తి, లక్ష్మణ్, విశ్వనాథం పాల్గొన్నారు.
లేకుంటే ఉద్యమిస్తాం
కూటమి ప్రభుత్వానికి గిరిజన
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కిల్లో సురేంద్ర హెచ్చరిక