
అరకొర సిబ్బంది.. అంతటా ఇబ్బంది
రాజవొమ్మంగి: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ (సీ్త్ర శిశు సంక్షేమ శాఖ కార్యాలయం) పాలనను అధికారులు గాలికి వదిలేశశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో గత రెండేళళ్లుగా పని చేస్తున్న సీడీపీవో వారం రోజుల క్రితం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలానికి బదిలీ అయ్యారు. బదిలీ ఆర్డర్ చేతికి రావడంతో ఆమె ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ స్థానంలో కొత్త వారు ఎవరూ విధుల్లో చేరకవడంతో ఇక్కడ ఐసీడీఎస్ కార్యాలయంలో పనులు స్తంభించాయని పలువురు చెబుతున్నారు. మరోవైపు ఇదే కార్యాలయంలోని గ్రేడ్–1 సూపర్వైజర్లు ఇద్దరు ఒకేసారి వారం రోజుల క్రితం ఇక్కడ నుంచి బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు చెప్పారు. ప్రస్తుతం యూడీసీ, మండల కో–ఆర్డినేటర్, గ్రేడ్ –2 సూపర్వైజర్ మాత్రమే కార్యాలయంలో పనిచేస్తున్నారు. దీంతో పరిపాలనాపరమైన సమస్యలు కార్యాలయంలో తిష్ట వేశాయని చెబుతున్నారు. ఉదయం 11 దాటినా కార్యాలయం తెరుచుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
సమస్యలు కోకొల్లలు
రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయంలో సమస్యలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. కార్యాలయ భవనం శిథిలస్థితి చేరింది. వర్షం కురిస్తే భవనం శ్లాబ్ నీరుగారుతోంది. గోడలు పూర్తిగా తడిసిపోయి బీటలు వారాయి. కార్యాలయంలో ఉంచిన పౌష్టికాహారకిట్లు తడిసిసోయి ముక్కువాసన వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. మరోవైపు ఈ శిథిల భవనంలో యథేచ్ఛగా ఎలుకలు, పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలామృతం కిట్ల ఎక్కడ భద్రపరచాలో తెలియని పరిస్థితిని సిబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎలుకలు విలువైన దస్త్రాలను, సామగ్రిని కొరికి పాడు చేస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజవొమ్మంగి ఐసీడీఎస్ కార్యాలయ పరిధిలో వందకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు బదిలీపై వెళ్లడంతో కేంద్రాల పనితీరును పట్టించుకొనే వారే లేరని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై వివరణ కోరేందుకు సంభందిత అధికారులు ఎవరూ స్థానికంగా అందుబాటులో లేరు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
ఐసీడీఎస్ కార్యాలయంలో సమస్యల తిష్ట
అందని సేవలు
పట్టించుకోని అధికారులు

అరకొర సిబ్బంది.. అంతటా ఇబ్బంది