టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు?

Jun 14 2025 7:21 AM | Updated on Jun 14 2025 7:21 AM

టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు?

టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు?

రంపచోడవరం: రాజ్యాంగబద్దంగా ఎటువంటి పదవీ లేకపోయినా పసుపు చొక్కా వేసుకుంటే చాలు ప్రొటోకాల్‌ పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తారా అంటూ అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం టీడీపీ కార్యకర్త సలాది బాపిరాజు అనే వ్యక్తి చేతులమీదుగా పాఠశాల హెచ్‌ఎం పుస్తకాలు, బ్యాగులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఆహ్వానం లేకపోవడం తగదన్నారు. ఏ అర్హతతో సదరు టీడీపీ కార్యకర్తతో పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయించారో అధికారులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై హెచ్‌ఎం, విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్‌, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి మండిపాటు

కలెక్టర్‌, టీడబ్ల్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement