పోస్టల్‌ పథకాలతో ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ పథకాలతో ఆర్థిక భరోసా

Jun 14 2025 7:21 AM | Updated on Jun 14 2025 7:21 AM

పోస్టల్‌ పథకాలతో ఆర్థిక భరోసా

పోస్టల్‌ పథకాలతో ఆర్థిక భరోసా

ముంచంగిపుట్టు: పోస్టల్‌ శాఖలో పొదుపు ఖాతాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఖాతాలు తెరిస్తే కలిగే ఆర్థిక భరోసాపై అవగాహన కల్పించాలని అరకు సబ్‌ డివిజనల్‌ పోస్టల్‌ ఐపీవో లక్ష్మీకిషోర్‌ సిబ్బందికి తెలియజేశారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో బీపీఎంలు, ఏబీపీఎంలతో శుక్రవారం పోస్టల్‌ సేవలపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు సబ్‌ డివిజన్‌ ఐపీవో లక్ష్మీకిషోర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి వె వెళ్లి పోస్టల్‌ శాఖలో ఉన్న పొదుపు ఖాతాలపై వివరిస్తూ అవగాహన కల్పించాలని.ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే పోస్టాఫీసులను వినియోగించుకొని పోస్టల్‌ సేవలు పొందేలా పని చేయాలని, ఎస్‌బీ, ఆర్‌డి, సుకన్య, ఆర్‌పిఎల్‌ఐ, పిఎల్‌ఐ, బీమా, ఐపిపిబి వంటి ఖాతాలు తెరిస్తే పొందే లబ్ధిని తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనంటే ఖాతాలకు ఎన్‌పీసీఎల్‌ లింక్‌ చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎంవో శ్రీను, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లు ,అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లు పాల్గొన్నారు.

అరకు పోస్టల్‌ ఐపీవో లక్ష్మీకిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement