
610 మంది ఇళ్ల డాక్యుమెంట్ల అందజేత
కూనవరం: పోలవరం నిర్వాసితులు ఇంటి వాల్యూ అవార్డు గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాల ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నసరయ్య కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం టేకుల బోరు, ఉదయ భాస్క ర్ కాలనీ, సినిమాహాల్ సెంటర్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి వ్యాల్యూ అవార్డు గ్రామసభను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 610 మంది తమ ఇంటి విలువకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. 15 మంది మాత్రం తమ ఇళ్లకు తక్కువ వాల్యూ వచ్చిందని రీ సర్వేకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, ఎంపీటీసీ సాంబశివరావు, పోలవరం సిబ్బంది చిన్నబాబు, రామారావు, సురేష్, గీత, ప్రసాద్, రాజు పాల్గొన్నారు.