
యోగా సాధనకు4.62 లక్షల మంది నమోదు
● జేసీ అభిషేక్ గౌడ
సాక్షి,పాడేరు: ఈనెల 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో యోగా సాధన కార్యక్రమాలు విజయ వంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.జే.అభిషేక్గౌడ ఆదేశించారు.శుక్రవారం ఆయన జిల్లా, మండల అధికారులతో పాటు యోగా ట్రైనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4.62లక్షల మంది యోగా సాధనకు నమోదు చేసుకున్నారని, 3,292 యోగా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అన్ని కేంద్రాల్లోను యోగా సాధన జరగాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులంతా దగ్గరగా ఉన్న సచివాలయాల్లో యోగా సాధన చేయాలని కోరారు. యోగా సాధనకు సంబంధించిన ఫొటోలను నోట్ కేమ్ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా నోడల్ అధికారి ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.